అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను . అంతట ఆయన అతనిని విడిచెను . అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను . నిర్గమకాండము 4:24-26 . ఐగుప్తుకు వెళ్లే మార్గం మార్గములో , పంపించిన దేవుడే చంపడానికి సిద్ధపడినట్లు కనబడుతుంది . ఎందుకని ? ఇది కొంచెం అర్ధం చేసుకోవానికి కష్టమైన వాక్యం . అయినప్పటికీ వాక్యమును కాస్త మనసు పెట్టి ఆలోచించగలిగితే వాస్తవాలు అర్ధం కాగలవు . దేవునికి మోషేకు మధ్య విస్తారమైన సంభాషణ జరిగినట్లు , అనేక సూచనలతో దేవుడు ఇజ్రాయెలీయులను విడిపించడానికి మోషేను ఐగుప్తుకు పంపిస్తున్నాడు అని ముందు అధ్యాయాల నుండి మనం గ్రహించవచ్చు . మోషేని మాత్రమే ఎన్నుకున్నానని చెప్పిన దేవుడే చంపడానికి నిలువబడ్డాడు మార్గమధ్యలో . ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుదాం . 1. మోషే మీద జరి...